టాలివుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం కొట్టేసింది. అమితాబ్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అమితాబ్, అజయ్ దేవగన్ కలిసి పనిచేస్తున్న సినిమా ‘మేడే’ కావడంతో ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘మేడే’ సినిమా కథ వైవిధ్యంగా ఉంటుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
అజయ్ ఈ కథను అమితాబ్ కు తగ్గట్లు తీర్చిదిద్దారని, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఒకటి ఉందని, ఆ పాత్ర కోసమే రకుల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మేడే’ సినిమాలో రకుల్, అజయ్ దేవగన్ కు కో పైలట్ పాత్రలో నటించనుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ విషయంపై రకుల్ సైతం స్పందించింది. రకుల్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాలని అనేకమంది నటీనటులకు ఉంటుంది. అందరిలాగే నేను కూడా ఆయనతో నటించాలని కలలు కన్నాను. ఆ కల ‘మేడే’ సినిమా ద్వారా నిజం కాబోతుందని తెలిపింది. ఈ సినిమాలోని తన పాత్ర కొత్తగ ఉంటుందని రకుల్ తెలిపింది.
ఇక ‘మేడే’ సినిమా షూటింగ్ వచ్చే నెల మొదటి వారంలో పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక పనిని చిత్ర బృందం పూర్తి చేసిందని తెలుస్తోంది. ఈ నెల చివరిలో సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను మీడియా ముఖంగా తెలియచేయబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా నటిస్తోంది. అంతేకాకుండా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి మేడే మూవీతో రకుల్ బాలీవుడ్ లో ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Must Read రకుల్ప్రీత్ సింగ్, నభా నటేష్ మొక్కలు నాటేశారు
Thankyouuuuuu 🤗🤗 https://t.co/GWIQDXLawB
— Rakul Singh (@Rakulpreet) November 19, 2020