తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని సినిమాల లాగే ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అన్ని సినిమాల షూటింగ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. కానీ రజనీ నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ ఇప్పటికీ స్టార్ట్ కాలేదు.
అందుకు కారణం రజినీకాంత్ కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పటికే రజనీకాంత్ ఒకసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. అందుకనే డాక్టర్ల సలహా మేరకు కరోనాకు మందు వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు నెలల వరకు కరోనాకు మందు వచ్చే సూచనలు కనపడటం లేదు. Also Read ;-రోబో చిట్టిగా రజినీ చితక్కొట్టింది ఇలాగేనట
ఈ కారణం చేతే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరిలో కాని మార్చిలో కాని ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ మొదలవుతుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సమ్మర్ లో రాబోతున్న తమిళ్ సినిమాలకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఇప్పటికే రజనీ నిర్మాతలకు తెలిపారని టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై రజనీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక రజనీకాంత్ కరోనా కారణంగా తన పొలిటికల్ ఎంట్రీ కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.