అంతులేని అరాచకం మాదిరిగా అధికారపార్టీ కుట్రలు!
కుప్పం మున్సిపల్ ఎన్నికల ఎంటైర్ ఎపిసోడ్ లో అధికారపార్టీ కుట్రలు అంతులేని అరాచకం మాదిగా సాగింది. కుప్పంలో ఎలాగొలా అధికారపార్టీ పాగా వేయాలని రూల్స్ బ్రేక్ చేసి తొక్కరాని అడ్డదారులన్నీ తొక్కింది. మేజరు పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్గ్రేడైన కుప్పం ఎన్నికలను అధికారపార్టీ చాలా సీరియస్ తీసుకుంది. అయితే రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా దానిని స్వాగతిస్తోంది. అలాకాకుండా దాడులు,బోగస్ ఓట్లు, పోలీసులు కేసులు, పెద్దన్న పాత్రపోషించిన ఈసీ ఒంటెద్దు పొకడలు వంటి కుట్రలు విపక్షాలకు కొత్త సవాళ్లునే విసిరాయి. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా అధికారపార్టీ ఆగడాలను టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకుంటునే వచ్చాయి. నామినేషన్ వేయకుండా అడ్డుపడినా, నామినేషన్ వేయడానికి వచ్చిన వారిపై దాడి చేసి, కేసుల్లో ఇరికించినా కుప్పం టీడీపీ శ్రేణులు ఎక్కడ తగ్గలేదు. ఇదొక కొత్త అనుభవమని, రాజకీయ పరాకాష్టకు కొత్త అర్థాలను చాటి చెప్పాయని ధీటుగా ఎదుర్కొన్నారు. దొంగ ఓట్లు బస్సులు, కారులు ద్వారా కుప్పానికి వచ్చి చేరుతుండగా .. వారిని అడ్డుకుని నిలువరించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ధీటుగా టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయనే చెప్పవచ్చు.
కచ్చీఫ్ లా ఒకరు, చేతికర్రగా మరొకరు!
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అధికారులే రాజకీయాల్లో పావులుగా మారి వన్ సైడ్ గా వ్యవహరిస్తే రాజ్యాంగం అపహాస్యంకాక మరేమౌతోంది! సరిగ్గా కుప్పంలో జరిగింది కూడా ఇదే. అధికారపార్టీకి కచ్చీఫ్ లా పోలీసులు వ్యవహరిస్తే .. ఈసీ చేతికర్ర మాదిరిగా పనిచేస్తే అబాసుపాలయ్యాయి. నిష్పాక్షపాతంగా ఎన్నికల నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించి పోర్జరీలకు పాల్పడతారు. అదేమేటని ప్రశ్నిస్తే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఇలా ప్రతిపక్ష టీడీపీని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. దొంగ ఓట్లకు కుప్పంలో వేలకొద్ది కొత్తముఖాలు దర్శనమిచ్చాయి. ఎన్నికల రోజు అని కూడా చూడకుండా టీడీపీ ఏజెంట్లును పోలింగ్ బూత్ ల్లోకి పోకుండా అరెస్ట్ చేశారు. దొంగ ఓట్లును ఎక్కడిక్కడ నిలువరించి అడ్డుకుంటే లాఠీలకు పనిచేప్పి, ఈడ్చుకెళ్లి జైల్లో పడివేశారు. ఇలా కుప్పం పోరులో కార్యకర్త పాత్రలో ఈసీ చేతికర్రలా పనిచేస్తే.. కచ్చీఫ్ మాదిరిగా పోలీసు బాసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
దొంగ ఓట్లను పట్టించిన వారిపై విరిగిన లాఠీలు!
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం దాపురించింది. అధికారపార్టీ నాయకులకు వాకల్తా పుచ్చుకుని మరి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక పోలీసువారైతే కార్యకర్తలు మాదిరిగా నామినేషన్ల కానుంచి ఎజెంట్లు పోలింగ్ బూత్ ల్లోకి వెళ్లనీయకుండా అరెస్ట్ చేసే వరకు వారు పోషించి ద్విపాత్రాభినయం పరమ జుగుప్సాకరం. నోటిఫికేషన్ రాకముందే బెంగూళూరు, కేజీఎఫ్, కృష్ణగిరి తదితర పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి, వారి ఓటు కార్డుల్లో ఎంపిక చేసిన దొంగ బ్యాచ్ ఫోటోలు అంటించి మరి ఓటరు కార్డులను తయారు చేసింది అధికార పార్టీ. దీనికి లోకల్ వలంటీర్స్ పూర్తి సహకరించారు. ఈవిధంగా దొంగ ఓట్లను పోల్ చేయడానికి అధికారపార్టీ స్కెచ్ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దండయాత్రగా దాడికి సిద్ధమైన దొంగ ఓట్లను గుర్తించి వారిని నిలువరించడంలో టీడీపీ శ్రేణులు సఫలీకృతమయ్యాయి. ఈక్రమంలో టీడీపీకి చెందిన నాయకులపై, కార్యకర్తలపై పోలీసు లాఠీచార్జి చేశారు. కొందర్ని అదుపులోకి తీసుకుని కేసులు కూడా కట్టారు. ఇలా అధికారపార్టీ కుప్పంలో చేసి అలజడిని చూసి యావత్తు రాష్ట్ర ప్రజలు నివ్వేరపోతున్నారు.
Must Read ;- ఏపీలో తిరుగుబాటు బావుట!











