ఫ్యాన్ పార్టీలో ఇక ప్రకంపనాలే!
గుడివాడ కేసినో వ్యవహారం రోజురోజుకు ఫ్యాన్ పార్టీపై వత్తిడిని పెంచుతున్నాయి. కేసినో నిర్వాహకులపై చర్యలు తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ తగ్గేదేలే అంటూ వ్యూహాత్మకంగా ముందుకుపోతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో వేసిన నిజ నిర్థారణ కమిటీ సభ్యులు గుడివాడ వెళ్లి.. ‘కే’ కన్వన్షన్ లో జరిగిన కేసినో వ్యవహారంపై అసలు వాస్తవాలను వెలికి తీశారు. వాస్తవాలను, స్థానికుల అభిప్రాయాలను సేకరించి.. పూర్తి సాక్ష్యాలతో కూడిన ఆధారాలను చంద్రబాబుకు అందజేశారు. అలానే చంద్రబాబు ఆదేశాల మేరకు ఫ్యాట్ ఫైండ్ కమిటీ మెంబర్స్ గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిశారు. సేకరించి ఆధారాలను రాజ్ భవన్ కు అందజేశారు. మంత్రి కొడాలి నాని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే గడిచిన పది రోజులుగా టీడీపీ కేసినోపై ఆందోళన చేస్తున్నా.. డీజీపీ గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
నేటి నుంచి కొడాలి నాని కాదు.. కేసినో నాని!
గుడివాడ కేసినో వ్యవహారంపై గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నిజ నిర్థారణ కమిటీ సభ్యులు గురువారం విజయవాడలోని రాజ్భవన్ కు వెళ్లారు. అయితే గవర్నర్ కు అస్వస్థత కారణంగా కలవలేకపోయినప్పటికీ.. కేసినో నిర్వహణపై సేకరించిన ఆధారాలను ఆయన కార్యదర్శి సిసోడియాను కలిసి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు కేసినో నిర్వహించిన నిర్వాహాకులపై, మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని కేసినో నానిగా మారి.. రాష్ట్రంలో విషసంస్కృతికి తెరలేపారని దుయ్యబట్టారు. డీజీపీ గౌతం సవాంగ్ కేసినో వ్యవహారం తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారని ఆరోపించారు.
Must Read:-గుంటూరులో ‘తెలుగుదేశం’ విజయకేతనం!