హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామాన్ని టీడీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. ఈ పరిణామంతో వైసీపీ వర్గాలు షాక్ తిన్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామం కర్నూలు జిల్లా రుద్రవరం పంచాయతీ ఎన్నికల్లో అక్కడి సర్పంచ్ పదవిని టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇక్కడ గోరంట్ల మాధవ్.. వైసీపీకి వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీడీపీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎంకే మధు గోరంట్ల మాధవ్కు దగ్గర బంధువు అవుతారు. దీంతో.. మధుకు మాధవ్ మద్దతు తోడవ్వడంతో ఏకగ్రీవం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కన్నా బంధుత్వానికే ప్రాధన్యం ఇచ్చిన మాధవ్ వైఖరి పట్ల వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీని సమర్ధించకుండా బంధువుకు మద్దతిచ్చారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని సమాచారం. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం.
Must Read ;- పల్నాడులో వైసీపీ నేతల అరాచకం, కిడ్నాపులు, బెదిరింపులు