టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీస్ లో కలర్స్ స్వాతి చాలా ప్రత్యేకం. చాలా చిన్నవయసులోనే టీవీ రంగం నుంచి సినీ రంగానికి అరుదెంచిన అరుదైన సుందరి ఆమె. ‘డేంజర్, ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, లండన్ బాబులు’ లాంటి సినిమాల్లో .. కేవలం తన అభినయంతోనే మెప్పించింది.
అలాగే ఆమె మాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి .. అక్కడా మంచి పేరు తెచ్చుకుంది. ఎర్లియర్ గా మలయాళంలో ఆమె నటించిన ‘త్రిశ్శూర్ పూరం’ మూవీలోని నటనకి మంచి మార్కులే యించుకుంది.
స్వాతిరెడ్డి వివాహానంతరం .. సినిమాలకు గ్యాపిచ్చి.. భర్తతో ఇండోనేషియాలో సెటిలైంది. ఇప్పుడు మళ్ళీ ఆమెకి నటనమీద ఆసక్తిపుట్టినట్టుంది. మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో స్వాతిరెడ్డి పంచతంత్రం అనే మూవీతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. హర్ష పులిపాక దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నరేశ్ అగస్త్యుడు, రాహుల్ విజయ్, శివాత్మిక, బ్రహ్మానందం, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పంచేంద్రియాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. మరి ఈ సినిమా స్వాతిరెడ్డికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కి బాలీవుడ్ అవకాశం ?