AP Govt Is Imposing Heavy Burden On People In Name Of One Settlement
టార్గెట్ పెట్టి వసూల్ పాల్పడుతున్న ప్రభుత్వం!
1983 నుంచి ప్రభుత్వం పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రుణాలిచ్చింది. అయితే వన్ టైం సెటల్మెంట్ (ఓటీఎస్) పథకం పేరుతో ఆ రుణాలను తిరిగి ప్రభుత్వ ఖజానా చేర్చాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం రుణాలతో నిర్మించుకున్న ఇళ్లకు సంపూర్ణ గృహ హక్కులు కల్పిస్తామని చెప్తూనే గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ. 15 వేలు, నగర పాలక సంస్థ రూ. 20 చొప్పున ప్రజల నుంచి కట్టించుకుని శాశ్వత గృహ హక్కులు కల్పింస్తామని ఆలోచనలు చేస్తోంది. అయితే రుణాలు పొందిన లబ్థిదారుల పూర్తి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే ఓటీఎస్ ద్వారా హక్కులు పొందవచ్చునని చెబుతునే మరోపక్క ఈ పథకం పూర్తి బాధ్యతలను నిర్వర్తించాలని వార్డు, గ్రామ వలంటీర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఓటీఎస్ విధానం ఒప్పకుని లబ్ధిదారులకు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ పెన్షన్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వసూళ్ల బాధ్యతను పూర్తిగా మీద వేసుకోవాలని సూచించింది. ఇలా ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసిందనట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. దీనిపై ఏపి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. నిజంగా ఏపీ ప్రభుత్వమే వలంటీర్స్ ను ఇలా ఆదేశించిదా? ఒకవేళ అలా ఆదేశిస్తే .. ఇలా కూడా అదేశిస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
AP Govt Is Imposing Heavy Burden On People In Name Of One Settlement
Must Read ;- ఏపీ ఈఎస్ఐ కు వైద్య పరికరాలు నిలిపివేస్తున్నాం..!











