క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తం కోతలే..!
రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్ కన్నా తక్కువ పీఆర్సీ విశ్రాంతి ఉద్యోగుల పాలిట శరఘాతంగా మారింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొత్తంలో కోతపడింది. ఫిట్మెంట్ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వృద్ధ పింఛనుదారులు తీసుకుంటున్న మొత్తం రికవరీ చేయనున్నది! ఎంత దారుణమంటే ఇలా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది! అంతేకాక మున్ముందు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ ( డీఆర్ – కరువు సాయం ) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. ఈ కారణాలతో దాదాపు రూ. 70 వేల నుంచి రూ. 1,00,000 వరకు ఫించనుదారులు నష్టపోతున్నది వాస్తవం! దీని ద్వారా భవిష్యత్తులో డీఆర్ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదన్నట్లు కనిపిస్తోందని ఫెన్షన్స్ సంఘాలు వాపోతున్నాయి.
డీఆర్ ను మరిచిపోవాల్సిందే ..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదారులను ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డీఆర్ మొత్తాలు అందే అవకాశం లేదన్నది వాస్తవం. ఈ జీవోను క్షుణ్ణంగా పరిశీలించి సీనియర్ పింఛనుదార్లు, ఇక జగన్ రెడ్డి ప్రభుత్వంలో మా మనుగడ కష్టమేనని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పింఛనుదార్లకు కొత్త స్కేళ్లో వివరాలను పొందుపరిచారు. ఎంత మొత్తం పింఛను అందుతోంది, ఇప్పటికే అధికంగా ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని, డీఆర్ నుంచి ఎలా మినహాయిస్తారు? వంటి అంశాలును జీవోల్లో పేర్కొంది. పింఛనుదార్లకు ఉద్దేశించిన జీవో – 2 లో 19.3 నిబంధన ప్రకారం ఇప్పటికే అదనంగా చెల్లించిన మధ్యంతర భృతిని, డీఆర్ బకాయిల మొత్తం నుంచి మినహాయిస్తామని స్పష్టంగా పేర్కొంది. చివరికి 70 – 80 ఏళ్ల మధ్య ఉన్న చాలా మంది పింఛనుదార్లు విధానంతో ప్రభుత్వానికే బకాయి పడే పరిస్థితి ఏర్పడుతోంది అన్నది సుస్పష్టం!
Must Read:-జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు..!!
మినహాయింపుల లెక్కలు ఇలా ..
కొత్త పింఛన్ లెక్క ప్రకారం వస్తున్న ఫెన్షన్ నుంచి ఐఆర్ అదనపు మొత్తాన్ని ఎలా మినహాయిస్తారన్న విషయం ప్రభుత్వమే స్పష్టంగా పట్టిక రూపంలో విశదీకరించింది. 70 ఏళ్లు లోపు ఉన్న వారికి ఎలా ఉంటుంది? 70 నుంచి 75 ఏళళ్లు లోపు, 75 నుంచి 80 ఏళ్లలోపు వారికి ఎలా? అన్నది లెక్కలు కట్టారు. 70 ఏళ్లు దాటిన పింఛనుదారులకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు. ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం ఇవ్వాలని నిర్ణయించింది. 75 ఏళ్లు దాటిన వారికి పాత విధానంలో రూ. 25,840 పాత మూల పింఛన్ ఉండి కొత్త మూల పింఛన్ రూ. 39,682 ఉన్న పింఛనుదారు రూ. 1,07,170 ప్రభుత్వానికి బకాయి పడ్డారు. వీరికి భవిష్యత్తులో డీఆర్ ను మరచిపోవాల్సిందే అన్నది తేటతెల్లం! ఇలా వయసును బట్టి వృద్ధ పింఛనుదారులు బకాయిలు పడనున్నట్లు తెలుస్తోంది!
Also Read:-టెన్షన్ : ఆదాయం లేదు, అప్పు రాదు.. ఏపీలో రూ.లక్షా 30 వేల కోట్ల బిల్లుల పెండింగ్
అంత్యక్రియల ఖర్చుల్లోనూ కోతలే..
జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పీఆర్సీ నిర్వాకం మూలంగా వృద్ధ పింఛనుదారు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల్లో కోతలు విధించింది. ఇంతవరకు మొత్తం రూ. 15 వేలు ఉండేలా చెల్లించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్టంగా రూ. 20 వేలు మించకూడదని పేర్కొంది. గతంలో నెల మొత్తం పింఛను ఎంత ఉంటే అంత ఇస్తోంది. నెల మొత్తం రూ. 25 వేలకు మించి ఆపై ఉన్న పింఛనుదారులు ఆ మొత్తాన్ని తాజా ఉత్తర్వుల ద్వారా నష్టపోవాల్సి వస్తోంది!











