పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తారనుకుంటే.. ఆదిపురుష్ మూవీని ఎనౌన్స్ చేశారు. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకుండానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.
ఈ సినిమాని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా స్టార్ట్ చేయకుండానే మరో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ ఎనౌన్స్ చేశారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ సినిమాని జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తుండడంతో నాగ్ అశ్విన్ తో సినిమా అసలు వుందా.? లేదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, దీపికా పడుకునే నటించనున్నట్టు ప్రకటించారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు ఎక్కువ అయ్యాయి. దీంతో ట్విట్టర్ లో ఓ నెటిజన్ నాగ్ అశ్విన్ ని న్యూయర్ లేదా పొంగల్ కి అప్ డేట్ ఉందా లేదా అని అడిగాడు. దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. పొంగల్ తర్వాత మనది అప్ డేట్ ఇస్తా. వర్క్ ఫుల్ ఫ్లో లో నడుస్తోంది అన్నారు. నాగ్ అశ్విన్ ఆన్సర్ తో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. మరి.. ఎలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.
Also Read: ప్రభాస్ ‘సలార్’ కి ముహుర్తం ఖాయమైంది.. !