టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు. ఆయన ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డారు. ట్రీట్ మెంట్ అనంతరం కోలుకున్నారు. చాలా రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.
తండ్రి బాటలో పయనించకుండా.. రత్నకుమార్ తనకున్న ఆసక్తితో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ, మలయాళ , సంస్కృత భాషల్లో ఇప్పటి వరకూ 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కార్తిక్, వినోద్ కుమార్, జగపతిబాబు, అర్జున్, అరవింద స్వామి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లకు ఎక్కవ డబ్బింగ్ చెప్పారు రత్నకుమార్. అంతేకాకుండా.. కొన్ని సినిమాలకు మాటల్ని కూడా అందించారు. రత్న కుమార్ మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
Must Read ;- కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత కా. రా. మాస్టారు మృతి