మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ, తుళు అమ్మాయి కృతి శెట్టి నటించిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై.. తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వైష్ణవ్ సూపర్ పెర్మార్మెన్స్ , కృతి శెట్టి అందాలు, విజయ్ సేతు పతి విలనిజం.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం… అన్నీ ఉప్పెన సినిమా కు హైలైట్స్ గా మారాయి. అంతేకాదు.. ఈ సినిమా నెరేషన్, కన్విన్సింగ్ క్లైమాక్స్ తో దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకుల్ని మెప్పించాడు. అందుకే ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
‘ఉప్పెన’ మూవీ విడుదలైన ఇప్పటికి 22 రోజులు అవుతుంది. విడుదలైన రోజు నుంచి సినిమా కలెక్షన్స్ వరద పారించి.. ఔరా అనిపించింది. అంతేకాదు.. డెబ్యూ మూవీకే వంద కోట్లు సాధించిన హీరోల్లోకెల్లా నెం.1 అనిపించుకున్నాడు వైష్ణవ్ తేజ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రికార్డ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ మూవీ రికార్డు ను బద్దలు కొట్టి.. అందరికీ షాకిచ్చాడు వైష్ణవ్ తేజ. ప్రస్తుతం ఈ వార్త మెగాభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఈ విజయాన్ని వైష్ణవ్ తో సహా.. మైత్రీమూవీ మేకర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మైత్రీ టీమ్ .. ట్విట్టర్ లో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ప్రత్యేక పోస్టర్ తో ప్రకటించారు.
Must Read ;- అఖిల్ తో బుచ్చిబాబు సినిమా నిజమేనా.?
Time and again it is proved that nothing can stop Good Cinema ❤️#100CroreGrossForUppena 🌊
మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు 🙏❤️#BlockbusterUppena#Uppena#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lAWjiaVjc4
— Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2021











