TTD Chairman YV Subbareddy Confusing Devotees On Tirumala Yatra
టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో డైలమాలో భక్తులు..
చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తిరుపతిలో ఇళ్లు భూమిలోకి కూరుకుపోతుంటే .. కొన్ని ప్రాంతాల్లో భూమిలో నుంచి నీటి ట్యాంకులు బయటకొస్తున్నాయి. వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం తిరుమల ఎగువ ఘాట్ రోడ్డుల్లో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి పడటంతో రోడ్డు తీవ్రమైన కోతకు గురైంది. దీంతో ఎగువ రోడ్డుకు రాకపోకలను నిలిపివేశారు అధికారులు. టీటీడీ తక్షణమే స్పందించి ఘాట్ రోడ్డు పనులను ముమ్మరం చేసింది. ఇదే రోడ్డుల్లోని 13 ప్రాంతాల్లో కొండ చర్యలు విగిపడ్డాయి. కొన్ని చోట్లు రోడ్డు దానికంతట అదే కుంగిపోతుంది. అయితే కొండచర్యలు విరిగిపడే సమయంలో వాహనాలు ఏమి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరదల సమయంలో కూడా టీటీడీ భక్తులకు పరిస్థితులపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ రోజు కూలిన కొండచర్యలు కారణంగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించిన టీటీడీ అధికారులు, ఛైర్మన్ తలోరకంగా స్టేట్మెంట్స్ ఇచ్చి భక్తులను కన్ఫ్యూజన్ లో పడిశారు. ఉదయం రోడ్డుప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 15 రోజులు పాటు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఙప్తి చేశారు. ఛైర్మన్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే టీటీడీ అధికారులు మరో స్టేట్మెంట్ ఇచ్చారు. సాయంత్రానికి తిరుమలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేవంటూ ఈవో జవహర్ రెడ్డి ప్రకటన చేశారు. ఇలా టీటీడీ అధికారులు, ఛైర్మన్ చెరోరకమైన ప్రకటనలు చేయడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లాలా? లేక 15 రోజులు వాయిదా వేసుకోవాలా? అన్న డైలమాలో ప్రస్తుతం భక్తులున్నారు. యాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
TTD Chairman YV Subbareddy Confusing Devotees On Tirumala Yatra
Must Read ;- ప్రకృతి వైపరీత్యాల నిధులు కూడా మింగేసారా?











