Josh Reduced In The Ruling YCP Cadre
రెండునరేళ్లల్లో సాధిచింది ఏమిటి?
జగన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర అనంతరం వచ్చిన 2019 స్వార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయకేతనం.. ఫలితంగా 151 సీట్లతో సీఎం పీఠం .. ఇవన్నీ కేవలం జగన్ రెడ్డి కి మాత్రమే సంతృప్తినిచ్చాయి. కానీ నిమ్మి గెలిపించిన ప్రజలకు, విశ్వసంతో పనిచేసి ఫ్యాన్ ను అధికారంలోకి తీసుకొచ్చిన కేడర్ కు మాత్రం చిన్నపాటి సంతృప్తిని కూడా ఇవ్వలేకపోయింది. 2021, డిసెంబర్ 1 తో రెండునరేళ్ల కాలాన్ని కూడా పూర్తి చేసుకొంది జగన్ రెడ్డి ప్రభుత్వం. పాలనను సగభాగం పూర్తిఅయ్యే సమయానికి కేడర్ల్లో అనేక రాజకీయ సమీకరణల కారణంగా జోష్ తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎంతో గ్రాండ్గా ఏ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేని పరిస్థితి దాపురించింది.
కేడర్ల్లో ఎందుకు మౌనరాగాలు!
దివంగత నేత జయంతి, వర్థంతి, సీఎం జన్మదినం, పార్టీ అవిర్భావ దినోత్సవాలు .. ఇలా అనేక కార్యక్రమాల్లో హడవుడి చేసే అధికార పార్టీ .. నేడు మౌనంగా ఉంది… ఒక్కరిలో ఆ జోష్ కానరావడంలేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఫల్యమో.. లేకుంటే ఆయన మనోవైకల్యామో పక్కనపెడితే .. ఏపీలో ఈ రెండునరేళ్ళ కాలంలో అటూ ప్రజల విషయంలోకానీ, ఇటూ కేడర్ విషయంలో కానీ ఏ ఒక్క సమస్యపై అదికార పార్టీ సకాలం స్పందించిన పాపాన పోలేదు. నవంబర్ 19న నాలుగు జిల్లాలా ప్రజలు వరదల్లో చిక్కుకుని ప్రజలు అల్లడుతుంటే .. హైదరాబాద్ పోయి విందుల్లో మునిగితేలుతాడు జగన్ రెడ్డి. పోని కేడర్ అయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉందా? అంటే అది లేదు. తానుపోకా.. మంత్రులు పోనివ్వకా.. ఎమ్మెల్యేలు పర్యటించక పోతే మరి ప్రజల గోడు ఎవరు పట్టించుకోవాలి. వరద బాధితులను సకాలంలో ఆదుకోవాడంలో, వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు వెనకడు వేసింది? అన్నదే ఇప్పడు అధికార కేడర్ కు మింగుడుపడని అంశం.
Josh Reduced In The Ruling YCP Cadre
ప్రతిపక్షాలు పోషించిన పాత్ర కూడా పోషించకుంటే ఎలా?
కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వాగులు పొంగి, నదులు ప్రాంతాలను ముంచెత్తి, ప్రాజెక్ట్ లు తెగి .. ప్రజా జీవనాన్ని కకావికలం చేస్తే .. అధికారపార్టీ ఎక్కడుందో తెలియదు. మూడు రోజులు పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు తిష్టవేసి మరి వారి గోడు విన్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆదుకున్నాడు. మరోపక్క బీజేపీ, జనసేనలు నాలుగు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి బాధితులను పరామర్శించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశాయి. వరదల్లో సర్వకోల్పొయి రిక్త హస్తలతో ఉన్న ప్రజలకు చిన్నపాటి భరోసా కూడా కల్పించలేకపోయింది అధికారపార్టీ. అదే వరదల సమయంలో కేడర్ ను పూర్తి స్థాయిలో వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేయించి .. సాధ్యమైనంత బడ్జెట్ కేటాయించి ఆదుకుంటే .. ఇప్పుడు కొద్దొగొప్పో ఒకరకమైన సాగభూతి ఉండేది. వరదల విషయంలో శ్రేణులను సమన్వయపర్చడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొంత అసంతృప్తి నెలకొంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పుల ఒత్తుళ్లు వంటి పార్టీ అయిష్టతను నెలకొల్పాయి. ఇవిలా ఉంటే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగతంగా దూషించడం, ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా శ్రేణులు వేడుకలకు పెద్దగా ఆశక్తి చూపడంలేదు. ఇలా అధికార కేడర్లో తగ్గిన జోష్ .. చివరికి పార్టీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
Must Read ;- ప్రకృతి వైపరీత్యాల నిధులు కూడా మింగేసారా?