విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయితే.. థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వాల పర్మిషన్ ఇచ్చినా ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేదు. అయితే.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలకు ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. కొంత మంది నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముదుకు వచ్చారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా నారప్ప చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఓటీటీ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
అయితే.. ఎప్పుడైతే నారప్ప ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి సురేష్ బాబు పై విమర్శలు మొదలయ్యాయి. వెంకీ అభిమానులు అయితే.. నారప్ప సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను థియేటర్లోనే రిలీజ్ చేయాలి ఓటీటీలో రిలీజ్ చేయద్దు అన్నారు. ఓ అభిమాని అయితే.. ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేశానని మిగిలిన వెంకీ అభిమానులు కూడా నిరాహార దీక్ష చేయాలి అంటూ సోషల్ మీడియాలో పిలుపు నిచ్చారు. నిన్న థియేటర్స్ ఓనర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నిర్మాతలు తొందరపడద్దు.. సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేద్దాం.
అక్టోబర్ వరకు ఆగండి అంటూ పిలుపునిచ్చాయి. దీంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారట. నారప్పను థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఓటీటీ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని.. వెంకీ కూడా రంగంలోకి దిగారని అందుచేత నారప్ప ఓటీటీలో కాకుండా థియేటర్లోనే వస్తుందని టాక్ వినిపిస్తోంది. అదీ.. సంగతి.
Must Read ;- వెంకీ గారాలపట్టి ఆశ్రిత ఏంచేసిందో తెలుసా?