ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. ఇంకా చెప్పాలంటే.. ఫస్ట్ మూవీ అయినప్పటికీ కొన్ని సీన్స్ లో ఎంతో అనుభవం ఉన్న నటిలా నటించింది. కుర్రకారు మనసులు దోచుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ లో డిమాండ్ బాగా ఉంది. ఉప్పెన రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే.. తనకున్న డిమాండ్ కు తగ్గట్టుగానే ఈ అమ్మడు రెమ్యూనరేషన్ బాగా పెంచేసిందట.
ఉప్పెన బ్యూటీ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని – డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ పాప ఇప్పుడు కొత్తగా రెండు సినిమాలకు ఓకే చెప్పిందట.
అందులో ఒకటి నితిన్ తో. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ నితిన్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడు. ఈ కథ నితిన్ కి బాగా నచ్చడంతో ఓకే చెప్పాడు. ఈ సినిమాతో ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నే ఫైనలైజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రెండో సినిమా బంగార్రాజు. నాగార్జున ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న క్రేజీ మూవీ ఇది. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన నటించేందుకు కృతి శెట్టిని ఫైనల్ చేసారని సమాచారం. ఇలా.. ఈ ఉప్పెన బ్యూటీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది.
Must Read ;- పవన్ – హరీష్ మూవీలో కృతిశెట్టి.. ఇది నిజమేనా?











