ఎన్నికల్లో మరో సంస్కరణకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. అయితే ఓటు పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం చేయడం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారా? లేదా? అని, ఒకే వ్యక్తి రెండుమూడు సార్లు ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఉండటం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తెలుస్తోంది. ఈ విషయమై డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ బుధవారం పార్లమెంట్లో ప్రశ్నించగా, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం చేస్తున్నట్లు సమాధానమిచ్చారు.
Must Read ;- మన దేశంలో నిర్బంధ ఓటు విధానం సాధ్యమయ్యేనా?











