పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న రాధేశ్యామ్ జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సివుంది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్ మూవీలో కూడా నటిస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న సలార్ కొంత టాకీ పార్ట్ షూటింగ్ జరుపుకుంది.
లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ – శృతిహాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. అయితే.. ఇందులో మరో హీరోయిన్ కి చోటుందని… కథ ప్రకారం ఇది కీలకపాత్ర అని సమాచారం. దీని కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ బ్యూటీ అంటే.. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన వాణీ కపూర్. సలార్ లో సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
వాణీకపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని నటించిన ఆహా కళ్యాణం సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సస్ కాకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో బెల్ బాటమ్, శంషేరా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీలో నటించడం కనుక నిజమైతే.. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
Must Read ;- బాలీవుడ్ కు పూత రేకుల రుచి చూపిన ప్రభాస్











