Special Story On Revanth Reddy :
ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఈ మాటలు టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి. ఓటుకు నోటు కేసులో అధికార నేతలు మానసిక క్షోభకు గురిచేసినా.. మంత్రులంతా వచ్చి కొడంగల్ లో ఓడించినా.. కించిత్తు కూడా బెదరలేదు. బంతిని నేలకేసి కొడితే ఎంత ఎత్తుకు ఎగురుతుందో.. అలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఇంతింతి.. వట్టుడింతై అన్నట్టుగా ఎంపీగా ఎన్నికై.. మళ్లీ తానేంటో నిరూపించుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెస్ డెంట్ గా బాధ్యతలు చేపట్టి.. తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ లో తమకు తిరుగేలేదని భావించిన అధికార పార్టీకి చుక్కులు చూపించారు. ప్రశ్నించే నైజం.. ప్రజా సమస్యలపై స్పందన.. అధికార పార్టీపై పదునైన మాటలు.. తిరగబడే లక్షణాలు.. ఇవన్నీ రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టాయి. కాంగ్రెస్ లో మహామహులైన నేతలను వెనక్కి నెట్టి.. టీపీసీసీని సొంతం చేసుకున్నారు.
రాజకీయాల్లో సంచలనం
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధారణ కుటుంబం. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిలో పుట్టారు. చిన్నప్పటి నుండే రాజకీయాల అంటే చెప్పలేని ఇష్టం. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఏబీవీపీ స్టూడెంట్ గా పలు సమస్యలపై గళమెత్తారు. డిగ్రీ పట్టా అందుకునే నాటికే.. రాజకీయాల్లో పీహెచ్ డీ చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మొదటి అడుగు
2006 లో టీఆర్ఎస్ లో చేరారు. జెడ్పీటీసీ గా పోటీ చేయాలని తీవ్రంగా శ్రమించారు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. తగ్గేది లే అంటూ వెంటనే టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి.. ఇండిపెండెంట్ గా బరిలో దిగి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యరు. 2008 తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. అధికార నాయకుల తీరు వల్ల ఓటుకు నోటుకు చిక్కుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడినా.. ఎంపీగా గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. ఇక టీపీసీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ లో కీలకంగా మారారు.
వ్యూహాత్మకంగా అడుగులు
సీఎం కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తూ.. ఢిల్లీ స్థాయిలో పార్టీ అధినాయకత్వాన్ని ఆకర్షించారు. ఎలాగైనా టీపీసీసీ చీఫ్ కావాలని భావించారు. టీపీసీసీ పీఠం ఇస్తే.. తాను కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని.. పార్టీని మళ్లీ అధికారంలో నిలబ్టెటేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్ అధిష్టాన్ని ఒప్పించి సక్సెస్ అయ్యారు. కొత్త బాస్ గా ఎన్నిక కాగానే.. ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోయారు. పార్టీ సీనియర్లు, వ్యతిరేకులను ఒకేతాటిపై తెచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్నో ఆశలు, మరెన్నో కలలు మధ్య ఇవాళ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్కు టానిక్ ప్లాన్!











