‘సీతాకోక చిలుక’ కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట్లో కార్తీక్ తెలుగు ప్రేక్షకులకు మురళిగా సుపరిచితం. ఆయన సీతాకోక చిలుక, అన్వేషణ, అభినందన, మగరాయుడు, పుణ్యస్త్రీ తదితర చిత్రాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టీస్టుగానూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ఆయన రాజకీయంగానూ చురుకుగా ఉన్నారు.
ఎన్నికల ప్రచారం చేసి ఇంటికి వచ్చాక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మనిద ఉరిమై కట్చి అనే పార్టీని ఏర్పాటుచేసి గత ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఈసారి అన్నాడీఎంకే, భాజపా కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన వయసు 60 ఏళ్లు దాటింది. శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి చేరాక అర్థరాత్రి అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
శ్వాస సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. చెన్నై అడయార్లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు సమాచారం. ఆయన కుమారుడు గౌతమ్ కార్తీక్ కూడా సినిమా రంగంలో హీరోగా కొనసాగుతున్నారు.
Must Read ;- ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత











