గోవును జాతీయ సంపదగా పేర్కొనాలని సినీ నటుడు సుమన్ తెలిపారు. జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు గో సంరక్షణ చేయాలని, తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. గోవుల హత్యలను ఆపాలని కూడా ఆయన అన్నారు. గో సంరక్షణ కోసం యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ చేస్తున్న కృషిన ఆయన అభినందించారు. హిందువులకు అన్నాయం జరుగుతుందని, ఆవు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. యుగ తులసి ఫౌండేషన్ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు తోడుగా నిలవాలని ఆయన కోరారు.
Also Read ;- ‘ధరణి’ కి ఆస్తుల వివరాలు ఇస్తే ఏమవుతుంది?