ఓ వైపు తెలుగు, మరోవైపు హిందీ, తమిళ, కన్నడ వంటి పలు భాషల చిత్రాలను చేస్తోంది ఆదాశర్మ. దాదాపు ఆరేళ్ళ క్రితం “హార్ట్ ఎటాక్” చిత్రం ద్వారా దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశారు .అందులో నితిన్ సరసన నటించిన ఆమెకు మంచి శుభారంభమే అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ “సన్నాఫ్ సత్యమూర్తి” , ఆది సాయికుమార్ “గరం;; తదితర చిత్రాలలో నటించింది. కెరీర్ కాస్త మందకొడిగా సాగుతున్న సమయంలోనే బాలీవుడ్లో ప్రత్యేక పాటలలో నర్తించడం మొదలు పెట్టింది. ఆలా అక్కడ పలు చిత్రాలలో ప్రత్యేక పాటలు చేసిన ఆమెకు టాలీవుడ్లో కూడా పాటలు చేసే అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో డా.రాజశేఖర్ నటించిన “గరుడవేగ” చిత్రంలో ఆదా స్పెషల్ సాంగ్ తో అలరించింది.

ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న ఆమెకు బాలీవుడ్లో మూడు ఆఫర్లు ఉన్నట్లు సమాచారం. వాటిలో ఓ చిత్రంలో విభిన్నమైన మగ పాత్రను ఆమె చేస్తుండటం ఓ విశేషం. ఇంకోవైపు కన్నడంలో సుదీప్ నటిస్తున్న చిత్రంలోనూ ఆదా నటిస్తోంది. తను నటిస్తున్న వాటిలో అధికభాగం చిన్న చిత్రాలే అయినా వేటికవే వైవిధ్యభరితమైనవి ఆమె చెబుతోంది. ఏది ఏమైనా పెద్ద హీరోల చిత్రాలలో అవకాశాలొస్తే అంతకంటే వేరొక ఆనందం ఇంకేముంటుంది అని ఆమె అంటోంది. పైపెచ్చు చాలామంది హీరోయిన్లకు తీసిపోకుండా పాత్రానుసారంగా ఎక్స్ పోజింగ్గ్ చేయడానికి కూడా వెనుకాడకపోవడం ఆమెకు నూతన అవకాశాలను తెచ్చిపెడుతుందేమో వేచి చూడాలి.
Must Read ;- జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా?











