సూపర్ స్టార్ అమితాబ్ తమ చిత్రంలో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. వైజయంతీ మూవీస్ ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న భారీ చిత్రంలో అమితాబ్ పోషించాల్సిన పాత్రకు రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. అందులో ఎంత నిజముందో తెలియదుగానీ ఓ సినిమాలో అమితాబ్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారట. 50 ఏళ్ల పాటు బాలీవుడ్ ను ఏలిన నటుడాయన. బాక్సీఫీసు రికార్డులు అనేకం ఆయన పేరుతో ఉన్నాయి. అలాంటి నటుడు పారితోషికం లేకుండా ఎలా నటిస్తారన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.
అలా ఆయన నటించిన సినిమా చెహ్రే. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా విడుదలైంది. ఈ విషయాన్ని నిర్మాత రూమీ జాఫ్రీ స్వయానా వెల్లడించారు. రియాలిటీ షోలతో, సినిమాలతో బిజీగా ఉంటే నటుడు ఇలా ఎందుకు చేస్తారని అందరూ అనుకుంటారుగానీ ఆయన తన సొంతకారులో సినిమా షూటింగుకు వస్తూ చెహ్రే పూర్తిచేశారట. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇందులో మరో హీరోగా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు అమితాబ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని, షూటింగ్ కు సొంత ఖర్చులతో వచ్చేవారని రూమీ జాఫ్రీ వెల్లడించారు. అంతేకాదు సినిమా కోసం విదేశీ ప్రయాణాన్ని సైతం సొంత ఖర్చులతో చేశారట.ఈ సినిమాలో క్రిస్టల్ డిసౌజా, రియా చక్రవర్తి కూడా నటించారు. అయితే అమితాబ్ పోషించింది గెస్ట్ రోల్ మాత్రమే. అయినా ఫ్రీగా చేయడం మాత్రమే విశేషమే కదా. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్సీఫీసు వద్ద బోల్తా పడింది.
Must Read ;- ప్రభాస్ లుక్ పై ట్రోల్స్.. ఎందుకిలా?