కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది పాజిటివ్ కేసులతో దేశం అట్టుడికిపోతోంది. క్షణ క్షణం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని బతుకున్నారు జనం. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో కూడా కరోనా విజృంభిస్తోంది. సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడడంతో .. వారంతా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ కారణంగా పలు చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి.
ఇప్పుడు కోవిడ్ కేసులు బుల్లితెర పరిశ్రమలో కూడా ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే జబర్దస్త్ బ్యూటీ వర్షా కోవిడ్ బారిన పడడంతో .. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఇక తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాని కారణంగానే అతడు చేయాల్సిన ఒక టీవీషో .. యాంకర్ రవితో జరుగుతోంది.
ఇక కోవిడ్ కారణంగా .. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు మృతిచెందారు. కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. దానికి కరోనా కూడా తోడవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ తండ్రి మరణానికి పలువురు వెండితెర, బుల్లితెర ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Must Read ;- చిత్ర పరిశ్రమలో వరుసగా కరోనా మరణాలు