ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అరెస్టై సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్రతో పాటు ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారని, అందులో భాగంగానే అరెస్టు జరిగిందని,రఘురామకృష్ణరాజుని తమ కస్టడీకి ఇవ్వాలని కౌంటర్ దాఖలు చేసింది.ఎవరో వచ్చి ఫిర్యాదు చేసే వరకూ వేచి చూడాలని చెప్పే హక్కు పిటిషనర్కు లేదని చెబుతూ రఘురామకృష్ణరాజు వేసిన ఎస్ఎల్పీకి కౌంటర్గా ఏపీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పేర్కొంది.
ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు..
‘రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది.అయితే ఆ హక్కును శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వినియోగించకూడదని,పొరపాటున రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేసినట్టు లేదు.ఉద్దేశపూర్వకంగా పలుమార్లు చేశారు.పలువురు వ్యక్తులతో కలిసి ఉద్దేశపూర్వకంగా,కుట్ర పూరితంగా కులాలు,మతాల మధ్య గొడవలు పెట్టి అశాంతి సృష్టించడానికి ప్రయత్నించారు.జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు.ఈ పరిస్థితుల్లో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యాఖ్యల వెనుక కారణం తెలుసుకోవాల్సి ఉంది.చివరికి పోలీసులపై ఒత్తిడి తెచ్చి సొంత వాహనంలో ఆర్మీ ఆసుపత్రికి వెళ్తూ తన పాదాలను బయటకు చూపారు.ఆ వీడియోలు యూట్యూబ్లో,మీడియాలో వచ్చాయని, ఇప్పటికీ ప్రజలను రెచ్చగొట్టే చర్యలే చేపడుతున్నారని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది.
కాగా సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.జ్యుడిషియల్ అధికారి సమక్షంలో,వీడియో చిత్రీకరణతో ఈ పరీక్షలు పూర్తయ్యాయి.రఘురామకృష్ణరాజు కాలికి గాయాలయ్యాయా,ఒకవేళ గాయాలైతే అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనే అంశంపై సీల్డుకవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా సుప్రీంకోర్టుకు సదరు జ్యుడిషియల్ అధికారి నివేదిక సమర్పించనున్నారు.సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎంపీ ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స పొందనున్నారు.కాగా రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.మరోవైపు రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని ఉందని,ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేసిందని చెబుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,కుమారుడు భరత్,కుమార్తె ఇందిరా ప్రియదర్శిని బుధవారం దిల్లీలో కేంద్ర హోం అమిత్షాను కలిశారు.రాజకీయకక్షతో ఈ అరెస్టు జరిగిందని,పుట్టినరోజు నాడు ఉద్దేశపూర్వంగా అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు.ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఏపీ హైకోర్టు ఆగ్రహం
రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.రఘురామ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఆదేశాలను, మెజిస్ట్రేట్ ఆదేశఆలను అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది.రఘురామకృష్ణరాజు కాలిగాయాలకు సంబంధించి వైద్యుల పరిశీలన నివేదికను మధ్యాహ్నంలోగా ఇవ్వాలని చెప్పినా సాయంత్రం ఆరుగంటల వరకు ఇవ్వలేదని,రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.సుమోటోగా ప్రభుత్వానికి,సీఐడీ అదనపు డీజీ,ఎస్హెచ్వోకు నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది.
Must Read ;- ప్రశ్నిస్తే ఎదురుదాడే.. బాబుపై వైసీపీ ఎంపీల విమర్శలే సాక్ష్యం