ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 338 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా 244 పరుగులకే ముగించింది. మరింత స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ..ఆ అవకాశాన్ని ఇరుజట్లు జారవిడుచుకున్నాయి. ఆసీస్ భారీ స్కోరుతో విజృంభిస్తుందని అందరూ భావించగా.. భారత్ కట్టడి చేసింది. ఇక టీమిండియా ఆసీస్ ను అధిగమిస్తుందని అనుకున్నా.. అదీ జరగలేదు. పిచ్ సైతం పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ దశలో బ్యాటింగ్కు అనుకూలిస్తుంటే, మరొక దశలో బౌలింగ్కు అనుకూలంగా మారుతోంది.
నోటికి పనిచెప్పిన ఆసీస్.. టీమిండియా స్వయం కృతాపరాధం!
మళ్లీ పాత పంథా… వీడియో వైరల్!
రోహిత్, గిల్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ను ఆరంభించారు. ఆసీస్ బౌలర్లను వారిద్దరూ దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకుంటున్నారు. వాళ్ల ఏక్రాగ్రతను దెబ్బతీసేందుకు లబుషేన్ పదే పదే విసిగించాడు. సరదా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. గిల్ను.. ‘నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. దానికి గిల్ ‘తర్వాత చెప్తా’ అని సమాధానమిచ్చాడు. ‘తర్వాత అంటే? ఈ బాల్ ఆడిన తర్వాతనా?.. సచిన్ ఇష్టమా? లేదా కోహ్లీనా’ అని అడిగాడు. దీనికి గిల్ ఎలాంటి సమాధానమివ్వలేదు. మరో ఎండ్లో ఉన్న రోహిత్ను కూడా లబుషేన్ మాట్లాడించడానికి ప్రయత్నించాడు. ‘క్వారంటైన్లో ఏం చేశావ్’ అని అడిగాడు. రోహిత్ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇలా వీరిద్దరి పార్టనర్ షిప్ ను దెబ్బతీసే వరకూ కవ్విస్తూనే ఉన్నాడు.కమిన్స్ విజృంభణ.. ముగ్గురు రనౌట్
పుజారా, గిల్ అర్ధశతకాలు…
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 96/2 ఓవర్నైట్ స్కోర్తో శనివారం మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 148 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఛెతేశ్వర్ పుజారా(50; 176 బంతుల్లో 5×4), శుభ్మన్ గిల్(50; 101 బంతుల్లో 8×4) అర్ధశతకాలు సాధించారు. మధ్యలో పంత్(36; 67 బంతుల్లో 4×4), చివర్లో జడేజా(28; 37 బంతుల్లో 5×4) ధాటిగా ఆడారు. అశ్విన్(10), సైని(3), బుమ్రా(0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. భారత్ 100.4 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో కమిన్స్ 4, హేజిల్వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ తీశారు.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా, లబ్షేన్ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా…బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు.