కరోనా కట్టడిలోMu ఘోరంగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేక రోజూ వందల మంది కరోనా రోగులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అవన్నీ ప్రభుత్వ హత్యలగానే భావించాలన్నారు. దీనికితోడు బ్లాక్ ఫంగస్కు కనీసం ఇంజక్షన్లు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులిపేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. కనీసం ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు కూడా కొనుగోలు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విమర్శించారు.
ఏపీ చాలా వెనుకబడింది
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అనేక రాష్ట్రాల కన్నా ఏపీ చాలా వెనుకబడిందని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి అయినా జగన్ బుద్ది తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఏపీలో ఇప్పటికి కేవలం 79 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారని ఆయన గుర్తు చేశారు. 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కనీసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి, కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
Must Read ;- సంక్షేమం ముసుగులో ప్రజలను మభ్యపెడుతున్న జగన్: యనమల