ఏమాయచేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సమంత.. అనతి కాలంలోనే ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ యాక్టీవ్ గా ఉంటుంది. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంటుంది. తనకు ఏది అనిపిస్తే.. అది మాట్లాడేస్తుంటుంది. అందుకనే అనుకుంట ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో రోజురోజుకు ఫాలోవర్స్ యమా స్పీడుగా పెరుగుతుంటారు.

తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా సమంత అభిమానులతో ముచ్చటించింది. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ చాట్ లో 20 ఏళ్ల వయసులో మీ గురించి చెప్పండి.? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఇంకా ఎదగాలి అనే తాపత్రయం తప్ప ఇంకేముంటుంది అని సమాధానమిచ్చింది. అలాగే 2020లో మధుర జ్ఞాపకం ఏంటి.? అని అడిగితే.. రానా పెళ్లి ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో యాడ్ చేసింది. ఇక `సోషల్ మీడియా ట్రోలింగ్ను ఎలా ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా. నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం నవ్వు వస్తుంటుంది అని రిప్లై ఇచ్చింది.
కారణం ఏంటంటే.. వారు ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిపిస్తుంది సమంత చెప్పుకొచ్చింది. చాలా తెలివిగా సమాధానం చెప్పిన సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే పిరియాడిక్ మూవీ చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది.
Must Read ;- సమంత తొందరపాటు .. మళ్లీ విమర్శలు











