బెయిల్ పై ఉన్నవారంతా.. జైలు పాలే..!
ప్రస్తుతం ఏపీలో బెయిల్ పై ఉన్నవారాంత జైలుపాలు కావడం తథ్యమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఆరోపించారు. మంగళవారం విజయవాడ కేంద్రంగా బీజేపీ తలపెట్టిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాక ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, మధ్యం పై వచ్చే డబ్బుతోనే పాలన సాగిస్తున్నార దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలో జగన్ ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని ఆరోపణ గుప్పించారు. పుష్ప సినిమాలో చూపించిన మాదిరిగా ఏపీ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని విమర్శిస్తూ.. విచారణకు ఏర్పాటు చేసిన సిట్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రకాష్ జవదేకర్ గుర్తు చేశారు. మరోపక్క మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కేసులన్ని బయకు తీస్తారా?
బీజేపీ ప్రజా ఆగ్రహ సభ ద్వారా తన స్టాండ్ ఏమిటో చెప్పటానికే ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. జగన్ రెడ్డితో ప్రత్యక్ష పోరుకు దిగుతున్నట్లు సంకేతాలించేందుకే .. ఐయామ్ ఫైర్ ..! ఐయామ్ ఫైర్ ..! అన్నట్లు సభ వేదికపైనా నేతలు స్టైల్లో రెచ్చిపోయారు. సోము, సునీల్, విష్ణువర్థన్ రాజు జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. రగిలిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే కడప జిల్లా స్టైల్లో జగన్ ప్రభుత్వంపై నాటు పంచ్ లను పేల్చాడు! త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయని ధ్వజమెత్తారు. వివేకా హత్యకేసు తనను ఇరికించాలని చూశారని, ఆయనను చంపింది ఎవరు.. అన్న వాస్తవాలన్ని బయటకొచ్చాయన్నారు. 31 నెలల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని మండిపడ్డారు. జగన్ కేసులన్నీ బయటకు తీసి.. ఆయనకు సూపర్ చెక్ పెట్టె రోజు త్వరలోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ఏపీ లో దాదాగిరి .. ఢిల్లీ చెంచాగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- వివేకానంద హత్యకేసులో అధికార పార్టీ V/S సీబీఐ..! మిస్టరీ వీడుతోందా?