దర్యాప్తు సాగదీసి .. కొల్కి తెచ్చి!
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య 2019 ఎన్నికల ముందు తీవ్ర దుమారాన్నే రేపింది. రెండునరేళ్ల కేసు విచారణ లో భాగంగా వివేకా కారు డ్రైవర్ దస్తగిరి అఫ్రూవర్ గా మారి పొద్దుటూరు కోర్టులో కన్పెషన్ స్టేట్ ఇచ్చాడు. వివేకా హత్యకేసులో ఒకరైన దస్తగిరి ఇచ్చి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో కీలక అంశాలను బహిర్గతం చేశాయి. బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్యకు ప్లాన్ చేశాడని దస్తగిరి చెప్పారు. అంతేకాక రాజకీయంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఎర్ర గంగిరెడ్డి మోసం చేశారనీ వివేకా.. గంగిరెడ్డి, అవినాష్ లకు వార్నింగ్ ఇచ్చారని చెప్పాడు. దీంతో ఇరువురు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పాడు. ఎర్రగంగిరెడ్డి,సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి హత్య చేశాడని వివరిస్తూ .. ఇందుకు మొత్తం రూ.40 కోట్లు సుపారీ ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నారు. అయితే దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. నిందుతులు ఎవరో తెలింది కనుక తక్షణమే అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ రెడ్డి కోడికత్తి కేసును కూడా త్వరగా విచారించి ముగించాలని పట్టుబడుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా .. తన సొంత బాబాయి వివేకా కేసు, తన కోడికత్తి కేసును ఇంకా సాగదీశారని విమర్శిస్తున్నారు.
పెద్ద పాత్రలు బయటికొచ్చి .. అనుమానాలను బలపర్చి!
వివేకా హత్య కేసులో బెంగళూరు ల్యాండ్ ఇష్యూ అయినప్పటికీ కుటుంబ సభ్యులపై వస్తున్న అనుమానాలకు బలం చేకూర్చిందన్నది దస్తగిరి వాంగ్మూలం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఈ హత్యలో ఉందన్నది వాంగ్మూల సారాంశం. కేవలం ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని రూ.40 కోట్ల సుఫారీతో
దస్తగిరితో కలిసి మరో నలుగురు వివేకా హత్యలో పాల్గొన్నారు. ఉన్నత స్థానానికి ఎదగడం కోసం కుట్రలు, కుతంత్రాలు,హత్యలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబుపై ఆ సమయంలో జేబు పత్రికలో వార్తలు రాయించారు. ముఖ్యమంత్రి పదవి కోసం హత్యలకు పాల్పడుతూ .. దానిని తెలుగుదేశం పై నెట్టేస్తే ప్రయత్నం ఆనాడు ముమ్మరంగా సాగింది. గుండెపోటు నుంచి గొడ్డలిపోటుకు డైవర్ట్ అయిన వివేకా మరణంపై ఆనాడు వైసీపీ ఆనాడు ఆడిన నాటకం రక్తికట్టింది. హత్యపై తెలుగుదేశం పార్టీ ఇచ్చే వివరణ ప్రజల్లోకి వెళ్లకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎందుకో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని విపక్షాలు నేడు పట్టుపడుతున్నాయి.
శవరాజకీయాలే దర్యాప్తుకు జాప్యం!
వివేక హత్య అనంతరం కేంద్రంలో పెద్దలను అడ్డంపెట్టుకుని జిల్లా ఎస్పీ ని మార్చారు. డీజీపీని, ఎన్నికల కిమిషనర్ మార్పుకు కారణాలను ఆనాడే టీడీపీ ఖండించింది. అయితే మార్చి 10, 2019 లో ఎన్నికల కోడ్ వస్తే .. మార్చి 15న వివేక హత్య జరిగింది. ఆ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలేవని తెలిసి దానిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారు. ఈ శవరాజకీయాలకు మూలం ఎవరో నేడు ప్రజలకు క్లియర్ కట్టుగా అర్థమౌతోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ కేసుపై దృష్టిసారించపోవడం, సిట్ వేసిన విచారణ లాంగ్ రన్ సాగడం, మరో వైపు సీబీఐ విచారణ కూడా అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పలు అనుమానులకు తావిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని సొంత చెల్లెలు హైకోర్టుకు వెళ్లి పోరాడడంతో ఏడాది తరువాత మార్చి 30, 2020 న సీబీఐ విచారణకు ఆదేశించడం జరగిందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఎప్పుడో ఆగస్టులో ఇచ్చిన వాంగ్మూలం వివరాలను సీబీఐ ఇప్పుడు బయటపెట్టడమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Must Read ;- రావణ కాష్టంలా ఏపీ.. కారణమెవరు?











