ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనే డిమాండ్కు తెలుగు రాష్ట్రంలో మాత్రమే కాదు.. విదేశాలలోని తెలుగువారు కూడా అనల్పంగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలనే దిశగా సాగుతున్న రైతుల పోరాటం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా అమరావతి నినాదాలు మిన్నంటాయి.
తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడి తెలుగువారితో కలిసి వాషింగ్టన్ డీసీలో అమరావతి డిమాండ్ను వినిపించారు. ఒకవైపు మంచు కురుస్తుండగా.. తెలుగువారందరూ కలిసి.. ‘మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు’ అంటూ తమ నినాదాలను హోరెత్తించారు.
one state one capital అలుపెరగని అమరావతి రైతుల దీక్షలు 365వ రోజు అని ముద్రించిన బ్యానర్లు, అమరావతి రాజధాని అనుకూల ప్లకార్డులను చేతపట్టి వారు ఈ నినాదాలు వినిపించారు.
అమరావతి పోరాటానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉంటున్న ప్రతిచోటా ఈ పోరాటానికి మద్దతు దక్కుతోంది. తెలుగుజాతి వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రణాళికాబద్ధంగా నిర్మాణంలో ఉన్న అమరావతి రాజధానిని చంపేయడం కరెక్టు కాదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
face book live :
https://fb.watch/2q3eyJyJwi/
Must Read :- అమరావతి.. నిన్నటి స్వప్నం, నేటి ఉద్యమం, రేపటి వాస్తవం!