మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక,పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.ముందు నుంచి తాము చెబుతున్నమూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. విశాఖలో కార్యనిర్వాహక,కర్నూలులో న్యాయ,అమరావతిలో లెజిస్లేటివ్ రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రికి ఎక్కడ నుంచైనా పని చేసుకునే హక్కు ఉందని,న్యాయస్థానాల్లో కేసులకు సంబంధం లేదన్నారు. న్యాయస్థానాల్లో కూడా తీర్పులు అనుకూలంగా వస్తాయన్న నమ్మకం తమకు ఉందని మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు.
సీఎం ఎక్కడ నుంచైనా పనిచేయవచ్చు
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో స్పష్టం చేశారు.సీఎం రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పని చేసుకునే హక్కు ఉందని విజయసాయిరెడ్డి ప్రకటించిన మరుసటి రోజే మంత్రి బొత్స ఇవే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అంటే ముందుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖ తరలించి అక్కడ నుంచే పాలన సాగిస్తారనే వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.కేసులు ఎలాగూ ఇప్పట్లో తేలేలా లేవు కాబట్టి సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే సీఎం ఎక్కడ నుంచైనా పని చేసుకోవచ్చనే ప్రచారం ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Must Read ;- 500 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం : ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్