బాహుబలి రెండు పార్ట్ లుగా రావడం.. చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆతర్వాత కేజీఎఫ్ మొదటి పార్ట్ రిలీజైంది. ఇప్పుడు కేజీఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. పుష్ప సినిమాను ముందుగా ఒకే పార్ట్ అనుకున్నప్పటికీ రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సలార్ మూవీని కూడా రెండు పార్ట్ లుగా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ సలార్.
ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడం..ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది కానీ.. లేకపోతే ఈపాటికే చాలా వరకు షూటింగ్ జరగాల్సింది. ఫస్ట్ సలార్ మూవీని ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్నప్పటికీ.. ఇప్పుడు సలార్ నీ రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఈ విషయమై.. ప్రస్తుతం ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు సాగుతున్నాయట. రెండు భాగాలుగా సినిమా విడుదల చేయడంలో చాలా సౌలభ్యాలున్నాయని, ముఖ్యంగా బిజినెస్పరంగా చూస్తే, భారీ లాభాలను ఆర్జించవచ్చన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన.
ఇది బాహుబలిలో వర్కవుట్ అయ్యింది. అలాగే కేజీఎఫ్ లోనే వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ స్ట్రాటజీని దృష్టిలో ఉంచుకుని, రెండు భాగాల ఆలోచన తట్టిందట. అయితే.. సలార్ లో రెండు భాగాలకు సరిపడినంత స్టఫ్ ఉందా, లేదా? ఫస్ట్ పార్ట్ రిలీజైన తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తారా..? లేక రెండు పార్ట్ ల షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాల గురించే ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Must Read ;- ప్రభాస్ రాధేశ్యామ్ లో షాకింగ్ సీన్స్ ఉన్నాయట