కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ సినిమా సంచలన విజయం సాధించిన తెలిసిందే. కన్నడ తోపాటు పలు ఇతర భాషాల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా పై ప్రేక్షకుల్లో ఏర్పడిన భారీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్.
యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అధీర అనే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెకెక్కుతున్న ఈ సినిమాను జులై 16న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆతర్వాత అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేశారు. కేజీఎఫ్ ఫ్యాన్స్ అక్టోబర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే.. కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడం.. సినిమాల విడుదల వాయిదా పడడం తెలిసిందే.
సరికొత్త విడుదల తేదీని జూలై 16న ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి కానీ.. ప్రకటించలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రిలీజ్ లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రం పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు సమాచారం. మరి.. భారీ అంచనాలు ఉన్న కేజీఎఫ్ 2ను విడుదలను అఫిషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో..? ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
Must Read ;- ప్రభాస్ కు ఇక ఆ అవకాశం లేనట్టే!











