పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం నాలుగు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగూ పాన్ ఇండియా సినిమాలు కగా.. వాటిలో ఏకంగా మూడు సినిమాల్ని ట్రాక్ మీద పెట్టాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధం గా ఉన్న రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రాలు సెట్స్ మీదుండగా.. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
అయితే వీటిలో ‘రాధేశ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు మూడూ.. ఒకే లొకేషన్ లో షూటింగ్ జరపుకోనుండడం విశేషంగా మారింది. ఇందులో మొదటగా రాధేశ్యామ్ మూవీకి సంబంధించిన ప్యాచ్ వర్క్ అండ్ రీషూట్స్ ను హైద్రాబాద్ లోనే ప్లాన్ చేశారు. దీని తర్వాత ఆదిపురుష్ సినిమా యూనిట్ దాదాపు 150 రోజుల షెడ్యూల్ ను హైద్రాబాద్ లోనే ప్లాన్ చేశారు. అలాగే.. ప్రశాంత్ నీల్ సలార్ కూడా త్వరలోనే హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. సో.. కూర్చున్న చోటు నుంచి కదలకుండా.. ఎంచక్కా మూడు సినిమాల షూటింగ్స్ ను ప్రభాస్ ఒకేచోట కానిచ్చేస్తున్నాడన్నమాట.
Must Read ;- మరోసారి తండ్రీ కొడుకులుగా ప్రభాస్ .. ఇంతకీ ఏ సినిమా?