టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేఖ రాశారు. టీడీపీ మద్దతునిచ్చిన అభ్యర్ధులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మాచెర్ల ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి, ఈ బెదిరింపు వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు తన లేఖలో ఫిర్యాదు చేశారు చంద్రబాబు. వారిపై చర్యలు తీసుకోవాలని.. అభ్యర్ధులు స్వేచ్ఛగా ఎన్నకల్లో పోటీ చేయగలిగే వాతావారణం ఉండేలా చూసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు సూచించారు చంద్రబాబు.
టీడీపీ నాయకులతో, కార్యకర్తలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, వైసీపీ బెదిరింపులకు భయపడకండని.. పార్టీ ఎప్పుడూ మీకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. వారిలో మనోధైర్యం నింపిన చంద్రబాబు.. పట్టుదలతో స్థానిక ఎన్నికలలో పనిచేయాలని.. అధికార పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను మనం ఉపయోగించుకోవాలని చెప్పుకొచ్చారు.
Also Read: మంత్రి పెద్దిరెడ్డి బరితెగింపునకు పరాకాష్ట











