Candrababu Directed The TDP To Repel The Attacks Of The Ruling Party
కొండపల్లి విజయం స్పూర్తిని నింపుతోంది!
టీడీపీ శ్రేణులకు భద్రత అవసరం.. ఇప్పటి వరకు మనం రాజకీయంగా తుఫాను, వరదలను మాత్రమే ఎదుర్కొన్నాం… ఇక మీదట ఊహించని ఉపద్రవాలను ఎదుర్కొవాల్సి వస్తోంది .. ఈక్రమంలోనే పసుపు శ్రేణులను అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ అంతా ఫుల్ యాక్టీవ్ కావాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా పార్టీ పూర్తి స్థాయిలో అండంగా నిలబడుతోందని భరోసా కల్పించారు. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల వార్ లో అధికారపార్టీ సాగించిన హింసా పాతం గుర్తు చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించి కేడర్ కు దిశనిర్దేశం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి పాటుపడ్డ ప్రతిఒక్కరిని ఆయన అభినందిచారు. ఇక మీదట నియోజకవర్గాల్లో సమర్థులకే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు నాయకులు సంసిద్ధంగా ఉండాలని, అటువంటి వారికే పార్టీలో ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానంలోని ముఖ్యులను చంద్రబాబు ఆదేశించాడు.
Candrababu Directed The TDP To Repel The Attacks Of The Ruling Party
సమిష్టి కృషితోనే అకృత్యాలను ఎదుర్కొంద్దాం!
అధికారపార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా పార్టీ సమిష్టి కృష్టి అవసమని చంద్రబాబు శ్రేణులకు వివరించారు. ఏడాదిలో 360 రోజులు ప్రజల్లో ఉండి .. ప్రజా సమస్యల పరిష్కరం కోసం పోరాటాలు సాగించాలన్నారు. కొండపల్లిలో నాయకులు, కార్యకర్తలు వ్యవహిరించిన తీరే టీడీపీకి మంచి ఫలితాలను ఇచ్చాయని, అటువంటి వ్యూహాలను, పోరాటాలను స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. జగన్పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, నేతలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే రెండేళ్లు అరాచక పాలనకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి నాయకులందరూ యాక్టీవ్ గా ఉండి, కేడర్ ను కాపాడాలని, వారి సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి పూర్తి భరోసా కల్పించాలని దిశనిర్దేశం చేశారు.
Must Read ;- టీడీపీకి ఓట్లేస్తారా? .. పనిలోకొస్తే పంపేస్తాం..!











