The Central Government Series On The Use Of Panchayat Funds In AP
దేశంలో ఎక్కడలేని దారుణాలు .. ఎందుకో ఈ విధానాలు!
ఏపీలో జగన్ ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు దేశంలో ఎక్కడ కన్పించవు. 40 ఏళ్ల క్రితం గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లుకు వన్ టైం సెటిల్మెంట్ విధానం తీసుకొచ్చి ముక్కుపిండి బకాయిలను వసుళ్లు చేయాలని ప్రయత్నించడం, వర్సీటీలోని నిధులను లాగేసుకోవడం, ఆస్తులను తాకట్టుపెట్టి ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి.. పాలన బండి నడిపించడం, లక్షల కోట్లకు లెక్కలు చెప్పకుండా కాగ్ ను తికమకపెట్టడం వంటి అనేకం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి అనుసరించరు. కనీసం కనీవినీ ఎరగరు. ఆర్థిక విధ్వంసాలకు నూతన అర్థాలు తెలుపుతూ.. ఆదాయ మూల ధ్వస రచనలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం తాజాగా పంచాయతీ నిధులను లాగేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ లు ఆగ్రహించారు. కొందరైతే ఒకడుగు ముందుకు వేసి నిరసనలు వ్యక్తం చేస్తే .. జగన్ రెడ్డి సొంతజిల్లా కడపలో 13 మంది సర్పంచ్ లు ఒకేసారి రాజీనామా చేసి, నిరసన వ్యక్తం చేశారు. గతంలో 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల పేరిట రూ.1300 కోట్లను లాగేసుకోవడం, వారం రోజుల క్రిందట 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.944 కోట్లను పంచాయితీ అకౌంట్ల నుంచి ఆర్థికశాఖ మళ్లించుకోవడం వంటివాటిపై కేంద్రానికి ఫిర్యాదులు పెద్దఎత్తున అందాయి. ఈ విషయంపై స్పందించిన కేంద్రం ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
The Central Government Series On The Use Of Panchayat Funds In AP
పెత్తనం తగ్గించి .. తగినశాస్తి చేసిన కేంద్రం!
పంచాయితీలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం తగ్గించేందకు కీలక ఆదేశాలను జారీ చేసింది కేంద్రం. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లును పంచాయితీ పేరిట ప్రారంభించాలని ఆదేశించింది. ఇకమీదట 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయితీలు ప్రారంభించే కొత్త అకౌట్లలోకి బదిలీ చేయాలని సూచించింది. కేంద్ర ఆదేశాలతో అప్రమత్తమైన పంచాయితీ రాజ్ కమీషనర్ .. జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తఖాతాలను గ్రామ పంచాయతీ పేరు మీద అది యూనియన్ బ్యాంక్ లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులను కమీషనర్ ఆదేశించారు. ఇకపై కేంద్రం విడుదల చేసే నిధులను పంచాయతీ తెరచిన కొత్త ఖాతాలోకి నేరుగా వచ్చి చేరునున్నాయి. ఇలా జరిగితే ఇప్పటీకే ఆదాయ వనరులు లేక, నిధులు లేక కునారిల్లుతున్న స్థానిక సంస్థలకు కొంత ఊరట, ఉపసమనం లభిస్తోంది.
Must Read ;- ప్రకృతి వైపరీత్యాల నిధులు కూడా మింగేసారా?











