Chandrababu Visit To Kadapa And Chittoor Districts
వరద బాధితులకు నా వంతు …!
ఈ నెల 19న సీమలో వరదలు సృష్టించిన సునామికి జన జీవితం అస్తవ్యస్థమైంది. ఆదుకోవాల్సి జగన్ రెడ్డి గగనవీధుల్లో విహారం చేసి, తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తాడు. వరదల్లో రోడ్డునపడ్డ బాధితుల గోడు విని, ఇబ్బందులను కళ్లారా చూసి వారితో ముఖాముఖిగా మాట్లాడేందకు అధికారపార్టీలో ప్రజాప్రతినిధులు కరువైయ్యారు. సీమలో పొంగిన వరదలు, ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు హృదయంలో అవమాన భారంతో ఉప్పొంగిన కన్నీటి ఏరులకు ఒక సంబంధం ఉంది .. అదే నవంబర్ – 19. అయినా ఆ రోజుతో అక్కడే ఆగకుండా .. మరుసటిరోజు శ్రేణులను ఆదేశించాడు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో వరద బాధితులను ఎన్టీఆర్ ట్రస్ట్ నిధులతో ఆదుకోవాలని సూచించారు. అండగా నిలవాలని కోరారు. అది లీడర్ స్పూర్తి అంటే అన్నట్లు శ్రేణులు ఉత్సహంగా బాధితులకు సాయం అందించారు. అదే నేపథ్యంలో రెండు రోజులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని షేడ్యూల్ ను ఖరారు చేసుకుని, తనవంతు భరోసా బాధితులకు కల్పించాలని చంద్రబాబు ముందకు సాగుతున్నారు.
Chandrababu Visit To Kadapa And Chittoor Districts
రెండు రోజుల టూర్ .. ఇలా ….
మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మరోసటిరోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు టూర్ ఉంటుందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. కడప జిల్లా రాజంపేట మండలం తోగూరుపేట గ్రామంలో ముందుగా చంద్రబాబు పర్యటించి, అక్కడి బాధితులను పరామర్శిస్తాడు. 12 గంటలకు మందపల్లె, 12.25 కు పులపుత్తూరు, 12.45 కు గుండ్లూరు పర్యటింస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తరువాత రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాలో బాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి అర్భన్ ఏరియాలోని ఆటోనగర్ లో వరదతో దెబ్బతిన్న ప్రాంతాల్లో బాబు పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురం సర్కిల్, 4.30 కు మత్యాలరెడ్డి పల్లె వంటి పలు ప్రాంతాలను చుట్టి, రాత్రికి రేణిగుంటలోని వై -కన్వెన్షన్ హాలుకు చేరుకుని రాత్రికి బస చేస్తారు. బాబు టూరు షేడ్యూల్ ఇలా ఉంటే .. మరోపక్క టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ .. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Must Read ;- టీడీపీ అత్యవసర సమావేశం .. రూట్ మ్యాప్ రెడీ!










