Police Attack Former Minister Ayyanapatrudu
నిరసన తెలిపే స్వతంత్రత కూడా లేదా?
శాసన సభను అధికార పార్టీ కౌరవ సభగా తీర్చింది. అడ్డు చెప్పినవారి వ్యక్తిత్వాన్ని, వక్తిగతాన్ని హననం చేయడం ముఖ్య పనిగా పెట్టుకుంది. నిండు సభలో చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి జరిగి అవమానాన్ని ముక్తం కఠంతో యావత్తు ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అందులో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో శ్రేణుల నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది పార్టీ. అనుమతులివ్వకుండా ర్యాలీని అడ్డుకున్నాయి పోలీసులు బలగాలు. కనీసం రోడ్డుపై నిరసనలు తెలుపుకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదా? అని అయ్యన్న ప్రశ్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై కూర్చోని కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. ఒక దశలో పోలీసులకు, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడి చేతికి గాయమైంది. ధర్నా కాస్తా .. తీవ్ర ఆందోళనగా మారింది.
Police Attack Former Minister Ayyanapatrudu
ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటన్న తప్పే!
ప్రభుత్వ పాలనను, జగన్ రెడ్డి విధానాలను పల్లెత్తు మాట అంటే … అది తప్పే! చేసే తప్పులను, దాష్టికాలను, దౌర్జన్యాలను ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే ద్రోహం. దేశ ద్రోహం కిందా కేసు నమోదు చేసి శిక్షాలు ఖరారు చేస్తారు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజనీతిజ్ఞుడు, గొప్ప రాజకీయవేత్త, అనుభవజ్ఞుడైన చంద్రబాబును పట్టుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.. భరించారు! ఆయన సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కించపరిచేలా మాట్లాడారు … ఇక సహించరు! ఇలాంటి దౌర్భగ్యాలకు పాల్పడుతున్న విషయాన్ని ఖండిస్తే చాలు .. వారిపై పోలీసు ఆంక్షాలు, పలు సెక్షన్ల కిందా నోటీసులు, తరువాత కేసులు, జైళ్లు! వరుస నియంతృత్వ పొకడలకు అద్దం పట్టేలా అధికారపార్టీ ఆగడాలు ఉన్నాయి. ఈ చర్యలే.. నిలదీసిన కూన రవికుమార్ ను అరెస్ట్ చేశాయి, చిత్తూరులో పర్యటిస్తున్న చంద్రబాబుకు నోటీసులిచ్చాయి, నేడు విశాఖలో అయ్యన్నపాత్రుడి పై దాడికి పురికొల్పాయి! ఈ రాజకీయాలు హుందతనంగా ఉండవని ఇప్పటికైనా జగన్ రెడ్డి గుర్తించాలి.
Must Read ;- నిలదీస్తే నోటీసులు ..ప్రశ్నిస్తే అరెస్ట్లా?