ఏపీ ప్రతిష్టకు భంగం కల్గిస్తున్నారనే ఆరోపణలతో ఎంపీ రఘురామరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కుట్రపూరితంగా రఘురామరాజును అరెస్ట్ చేయడంతో ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నాయకులు ఒక్కొకక్కరుగా రాఘురామరెడ్డికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీమంత్రి చినరాజప్ప రఘురామరాజు కేసు గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామ రాజు ప్రాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాన్నారు. వైసీపీ ఎంపీ పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ఏపీ కొనసాగుతున్న ఆరాచకాలపై కేంద్రం న్యాయ విచారణ చేయించాలని కోరారు.
Must Read ;- పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామరాజు లిఖిత పూర్వక ఫిర్యాదు.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్