భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు తొలిసారిగా శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయంలోని నందినికేతన్ గెస్ట్ హౌజ్ దగ్గర ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఆలయ ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్వీ రమణ దంపతుల వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మనందారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, ఇతర అధికారులు ఉన్నారు.
Must Read ;- లక్ష్మీ నరసింహస్వామి సేవలో సీజేఐ ఎన్వీ రమణ దంపతులు