భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ను అమెరికాలో వినియోగానికి సంబంధించి కీలక ముందడగు పడింది. అమెరికా విపణిలో ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బయోటెక్ అమెరికాలోని ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ఆక్యుజెన్తో గత ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.అప్పటి నుంచి మొదలైన ఈ ప్రక్రియలో తాజాగా మరో కీలక అడుగు పడింది.కొవాగ్జిన్కు సంబంధించిన మాస్టర్ ఫైల్ను అక్యూజెన్ సంస్థ సహకారంతో అక్కడి ఫుడ్ అండ్ డగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కి సమర్పించింది.అత్యవసర వినియోగానికి సంబంధించి ఈ వ్యాక్సిన్కు అనుమతి లభిస్తే అమెరికాలోనూ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.అనుమతుల ప్రక్రియలో భాగంగా బయోలాజికల్ లైసెన్స్ అప్లికేషన్కు,CMC(కెమిస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, కంట్రోల్)కి సంబంధించి సమాచారం మొత్తం అందించింది.మూడో దశ ట్రయల్స్కి సంబధించి భారత్ బయోటెక్ సమర్పించిన తరవాత FDA సమీక్ష జరపనుంది. అయితే ఈ అనుమతుల ప్రక్రియకు కావాల్సిన సమాచారం 90 శాతం వరకు సమర్పించామని ఆక్యుజెన్ వెల్లడించింది.
11దేశాల్లో అనుమతుల ప్రక్రియ..
కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన వ్యాక్సిన్ల జాబితాలో చోటు దొరకలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్యుజెన్ ప్రకటన కీలకంగా మారిందని చెప్పవచ్చు.పూర్తి భారతీయ వ్యాక్సిన్గా ఉన్న కోవాగ్జిన్కు బ్రెజిల్,హంగేరీ తదితర 14 దేశాల్లో అనుమతులు తుది దశకు చేరకున్నాయి.అనుమతులు వస్తే కొవాగ్జిన్ అంతర్జాతీయ వినియోగానికి దాదాపుగా లైన్ క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా భారత్ బయోటెక్ ఇప్పటికే గుర్తింపు కోసం దరఖాస్తు చేయడంతో పాటు 90 శాతం సమాచారాన్ని అందించింది.జూన్ నాటికి పూర్తి సమాచారం సమర్పించనుంది.ఈ అనుమతి వస్తే మరో 11దేశాలతో ఇప్పటికే కుదిరిన ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్ వాణిజ్యపరంగా ఎగుమతులు చేసే వీలుంటుంది.కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కేసులు విపరీతంగా పెరగడం,ఉత్తత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నందున భారత్ బయోటెక్ సంస్థ ప్రస్తుతానికి వాణిజ్యపరంగా వ్యాక్సిన్ ఎగుమతులను నిలిపి వేసింది. దేశంలో అవసరమైన వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించింది.భారత్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్ బయోటెక్తో డేటా మార్పిడి విషయంలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టిందని, ఒప్పదం కొనసాగుతుందని ఆక్యుజెన్ ఛైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి వ్యాఖ్యానించారు.
ఇక అమెరికాలో ఆక్యుజెన్ సహకారంతో కొవాగ్జిన్ టీకా విక్రయాలకు అనుమతి వస్తే వచ్చిన లాభాల్లో 45 శాతం ఆక్యుజెన్ తీసుకోగా,మిగిలిన సొమ్ము భారత్ బయోటెక్కు లభిస్తుంది.అమెరికా నుంచి కొవిడ్ను తరిమికొట్టేందుకు కొవాగ్జిన్ మంచి పరిష్కారం అవుతుందని ఆక్యుజెన్ చైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి గతంలోనే వ్యాఖ్యానించారు.కాగా తెలుగు మూలాలు ఉన్న డా.శంకర్ ముసునూరి ఆక్యుజెన్ కంపెనీ బోర్డు ఛైర్మన్గా ఉండడంతో పాటు న్యూరాన్ కంపెనీ వ్యవస్థాపకులుగా ఉన్నారు.చిన్న సంస్థగా ఏర్పాటైన ఆక్యుజెన్ ఇప్పుడు అమెరికాలోని ప్రముఖ బయోటెక్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
Must Read వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం











