యాక్షన్ డైనమైట్ .. గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి సంపత్ నంది దర్శకుడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక దీని తర్వాత గోపీ.. తేజ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘అలివేలు మంగ వెంకటరమణ’ టైటిల్ తో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోయే సినిమా లో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
‘జయం, నిజం’ చిత్రాల్లో గోపీచంద్ కు విలన్ వేషాలిచ్చి.. అతడి కెరీర్ కు తేజ బూస్టప్ నిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తోనే అతడు.. ఆ తర్వాత హీరో అయ్యాడు. ఇప్పుడు అదే గోపీచంద్ హీరోగా తేజ సినిమా చేయబోతుండడం విశేషాన్ని సంతరించుకుంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక గెస్ట్ రోల్ ఉందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం తేజ పాన్ ఇండియా స్టార్ దగ్గుబాటి రానాని సంప్రదించాడట.
రానాతో ఎర్లియర్ గా తేజ నేనే రాజు నేనే మంత్రి హిట్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకే రానా తేజ అడగ్గానే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించాడట. కరోనా ఉధృతం తగ్గి అన్నీ అనుకూలిస్తే.. సినిమా ను జూన్ నెల్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాలో రానా పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Must Read ;- హీరోగా దర్శకుడు తేజ తనయుడు?











