Dalit Girijana Dandora Grand Success In Indravelli :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష (టీ పీసీసీ) పదవి రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మరోమారు నిరూపితమైంది. రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన ఇంద్రవెల్లి సభ అనుకున్న దాని కంటే కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దళిత గిరిజన దండోరా పేరిట రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సభకు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి గిరిజనులు, ఆదివాసీలు, దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక రేవంత్ నింపిన జోష్ తో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంద్రవెల్లికి పోటెత్తాయి. పార్టీకి చెందిన ప్రముఖ నేతలంతా కూడా ఈ సభకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఒకరిద్దరు కీలక నేతలు ఈ సభలో కనిపించకపోయినా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సభను సక్సెస్ చేయడంపై దృష్టి సారించిన పార్టీ శ్రేణులు.. అసలు ఏఏ నేతలు వచ్చారు? ఎవరు రాలేదు? అన్న విషయాన్నే మరిచిపోయి కేరింతలు కొట్టారు. మొత్తంగా రేవంత్ మేనియాతో ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ గా అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
లక్ష మందికి ఒక్క తల తగ్గినా..
ఇంద్రవెల్లి సభను ముందుగానే ప్రకటించిన రేవంత్ రెడ్డి.. సభకు లక్ష మందికి తగ్గకుండా హాజరవుతారని ప్రకటించారు. రేవంత్ అనుకున్నట్లుగానే ఇంద్రవెల్లి సభకు ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు పోటెత్తారు. ఈ జన సందోహాన్ని చూసిన రేవంత్.. సభకు వచ్చిన వారి సంఖ్య లక్షకు ఒక్క తల తక్కువగా ఉన్నా తల వంచుతానంటూ సంచలన ప్రకటన చేశారు. సభకు వస్తున్న సామాన్య జనాన్ని కేసీఆర్ సర్కారు ఎక్కడికక్కడ నిలిపేసిందని రేవంత్ ఆరోపించారు. ఇక కేసీఆర్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఏకంగా బొంద పెడతామంటూ తనదైన శైలి ప్రకటనలు చేశారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు రజాకార్లకు మించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కూడా రేవంత్ ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని ప్రస్తావించిన రేవంత్.. టీఆర్ఎస్ కు చెందిన ప్రతి ఎమ్మెల్యేను పథకం కోసం నిలదీయాలని, పథకం రావాలంటే మీరు కూడా రాజీనామా చేయండని ఒత్తిడి తీసుకురావాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టిన రేవంత్.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో మొదలెట్టి.. మాజీ రాష్ట్రపతి నారాయణన్, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం దామోదరం సంజీవయ్య, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ, ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరుల పేర్లను వరుస పెట్టి మరీ ప్రస్తావించారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి రోడ్డు వెంటా నడుచుకుంటూ వస్తున్న గిరిజన, దళిత, ఆదివాసీలకు చెందిన ఓ వీడియోను రేవంత్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Must Read ;- అక్కడ టీఆర్ఎస్ ఓడితే!.. దళిత బంధు ఆగినట్టే!
Police stop the vehicles far from the ground….People are made to walk more than three kilometres to reach the ground.
They are my inspiration
They are my hope
They are my strength #ChaloIndravelli#DalitaGirijanaAtmagowravaDandora pic.twitter.com/3HUbOyQ8pR— Revanth Reddy (@revanth_anumula) August 9, 2021
తళుక్కుమన్న కొండా.. మెరిసిన సీతక్క
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి.. వైఎస్సార్ మరణం తర్వాత పలు పార్టీలు మారి.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని స్థితికి చేరిన కొండా సురేఖ ఇంద్రవెల్లి సభలో తళుక్కున మెరిశారు. చాలా కాలం పాటు అసలు బయటకే కనిపించని సురేఖ.. ఇంద్రవెల్లి చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. కొండా సురేఖ కనిపించగానే.. మళ్లీ ఆమె తన సొంత గూటికి చేరిందన్న దిశగా కార్యకర్తల హోరు వినిపించింది. ఇక ఇంద్రవెల్లి సభలో ఎమ్మెల్యే సీతక్క అన్నీ తానై వ్యవహరించిన వైనం కూడా అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ కు స్వాగత పలికిన దగ్గరి నుంచి సభ నిర్వహణ మొత్తం అన్నీ సీతక్కే చూసుకున్నారు. రేవంత్ కూడా సీతక్కకు అమితమైన ప్రాధాన్యం ఇచ్చిన వైనం కూడా చర్చకు వచ్చింది. టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ రేసులో వెనుకబడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినహా పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.











