డైనమిక్ డైరెక్టర్ వినాయక్.. మెగాస్టార్ చిరంజీవితో లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేయ నున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. కారణం ఏంటంటే.. చిరంజీవికి, అలాగే చిరు అభిమానులకు ఇష్టమైన దర్శకుల్లో వినాయక్ ఒకరు. అందుచేత చిరు, వినాయక్ కాంబినేషన్ లో మూవీ అనగానే ఎప్పుడెప్పుడు ఎనౌన్స్ చేస్తారా.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూశారు.
అయితే… లూసీఫర్ రీమేక్ ని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి చిరుకి వినాయక్ కథ వినిపించారు. వినాయక్ చేసిన మార్పులు చేర్పులు చిరుకు నచ్చలేదు. ఆయన సలహాతో మరోసారి కథ పై కుస్తీ పట్టినా.. మెగాస్టార్ ను మెప్పించలేకపోయారు వినాయక్. చిరంజీవి చాలా సున్నితంగా మనం మరో కథతో సినిమా చేద్దాం అని చెప్పేశారట. దీంతో వినాయక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ‘ఛత్రపతి’ మూవీ బాలీవుడ్ రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి ఓకే చెప్పడం జరిగింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే.. వినాయక్ కి జరిగినట్టే… బాబీకి కూడా జరిగిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే… చిరంజీవితో బాబీ కూడా సినిమా చేయాలనుకున్నారు. బాబీ అనుకోవడమే కాకుండా.. బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో చిరంజీవి కూడా బాబీతో సినిమా చేయాలనుకున్నారు. అంతే కాకుండా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో స్వయంగా చిరంజీవి బాబీతో సినిమా చేయనున్నాను అని ప్రకటించడం కూడా జరిగింది.
తాజా వార్త ఏంటంటే… బాబీ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదట. వినాయక్ లాగానే బాబీ రెండోసారి చెప్పినా చిరు సంతృప్తి చెందలేదని టాక్ వినిపిస్తోంది. మరి.. బాబీ మరో వెర్షెన్ రెడీ చేస్తాడా..? ఈసారైనా చిరును మెప్పిస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తొలి రోజు కలెక్షన్ 200 కోట్లని జోస్యం చెబుతున్నాడు.. !