మాస్ మహారాజా రవితేజతో మలినేని గోపీచంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ క్రాక్. సంక్రాంతి కానుకగా రిలీజైన క్రాక్ మూవీ ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. 50 శాతం సిటింగ్ కే పర్మిషన్ ఇచ్చినా.. క్రాక్ రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో దూసుకెళుతూ.. 50 కోట్ల క్లబ్ లో జాయిన్ కావడం విశేషం. ఈ సినిమాతో డైరెక్టర్ మలినేని గోపీచంద్ కి మంచి పేరు వచ్చింది. అలాగే వరుసగా భారీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
నందమూరి నటసింహం బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గోపీచంద్ బాలయ్య కోసం ఓ స్టోరీ రెడీ చేయడం కూడా జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. బాలయ్య ప్రజెంట్ క్రాక్ మూవీని చూడలేదట. క్రాక్ మూవీ చూసిన తర్వాత బాలయ్య టైమ్ ఇస్తారని.. గోపీచంద్ కథతో మెప్పిస్తే.. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడం ఖాయమని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా వెంటనే స్టార్ట్ కానుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ మలినేని గోపీచంద్ కి క్రాక్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే భారీ ఆఫర్ కూడా వచ్చింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ క్రాక్ ని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. బాలయ్యతో మూవీ, క్రాక్ బాలీవుడ్ రీమేక్.. ఈ రెండు ఆఫర్స్ లో ముందుగా క్రాక్ ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారట గోపీచంద్. మరి.. బాలీవుడ్ లో ఏ హీరో ముందుకు వస్తారో చూడాలి.
Must Read ;- గోపీచంద్ కి మెగాభినందనలు !