నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేస్తున్నారు. సింహ, లజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్, శ్రీవాస్, బి.గోపాల్.. ఇలా కొంత మంది దర్శకులు రెడీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్యతో సినిమా ప్లాన్ జరుగుతోందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. క్రాక్ సినిమాలో మాస్ సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో.. దర్శకుడు గోపీచంద్ మలినేనికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్ ఇవ్వడంలో తన మార్క్ చూపించాడు.
గోపీచంద్ కి సాలిడ్ కథ.. దొరికితే మాస్ హీరోలను బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అందుకనే అనుకుంట బాలయ్య – మలినేని గోపీచంద్ కాంబినేషన్ సెట్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేస్తోందని తెలిసింది. గోపీచంద్ దగ్గర బాలయ్యకు కరెక్ట్ గా సరిపోయే స్టోరీ రెడీగా ఉందట. త్వరలో బాలయ్యను కలిసి కథ చెప్పనున్నాడు అంటున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయం.
Must Read ;- బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కి 20 ఏళ్లు!