ఒకవైపు వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కోరల నుండి ప్రజలను కాపాడుతుంటే.. మరోవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కరోనాకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా అటువంటి ఒక వివాదస్పదమైన నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. థియేటర్లలో 100 శాతం జనాభాకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని కలిసిన కొన్ని రోజులకే ఇలాంటి నిర్ణయం వెలువడడంతో విజయ్పై విమర్శులు వెల్లువెత్తాయి. దీనిపై ఎందరో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్, శింబు, తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అరవింద్ శ్రీనివాస్ అనే వైద్యుడు రాసిన లేఖ ఇప్పుడు చర్చానీయాంసంగా మారింది.
Praying for you Tamil Nadu. pic.twitter.com/o5ESlWn8AB
— Joshua Michael (@joshmadj) January 5, 2021
అలసిపోయాం.. ఊపిరి పీల్చుకోనివ్వండి..
‘యాక్టర్ విజయ్, శింబు, తమిళనాడు ప్రభుత్వానికి రాస్తున్న లేఖ.. నేను అలసిపోయాను.. మేము అలసిపోయాము.. వేల మంది వైద్యలు నాలాగే అలసిపోయారు. ఆరోగ్య సిబ్బంది.. పోలీసలు.. పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరూ అలసిపోయారు. మేము ఎంతగానో శ్రమిస్తున్నాము. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడి.. దాని ప్రభావాన్ని తగ్గించడానికి మేము చేయని ప్రయత్నాలు లేవు. మీ కంటికి మేము చేస్తున్న పని అంత గొప్పగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. మా ముందు కెమెరాలు లేవు. మేము ఎటువంటి స్టంట్స్ చేయడం లేదు. మేము హీరోలం కాకపోవచ్చు. కానీ కాస్త ఊపిరి పీల్చుకునే సమయాన్ని కోరడానికి అర్హులం అనుకుంటున్నాను. ఎవరి స్వార్థానికో.. ఆత్యాశకో.. మమ్మల్ని.. మా శ్రమను బలి చేయకండి.
నేటీకీ కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా అంతం కాలేదనే విషయం గుర్తించండి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు 100 శాతం జనాభాను అనుమతించడం ఆత్మహత్యా సదృశ్యమే. హీరోలుగా పేరు గాంచిన వీరెవ్వరూ.. థియేటర్లలో జనాభా మధ్య సినిమా చూడడానికి వెళ్లరు. డబ్బు కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మా ప్రాణాలపై కాస్త దృష్టి పెట్టి.. కనికరం చూపండి. నేటికీ మనమంతా ఇంకా ప్రమాదంలో ఉన్నామని తెలియజేయడానికే నేనీ పోస్ట్ పెడుతున్నాను.
ఇట్లు
నిస్సహాయుడైన ఓ వైద్యుడు.
ఆలోచంపజేస్తున్న వైద్యుడి పోస్ట్
ఈ పోస్ట్ను చదివిన ప్రతి ఒక్కరూ.. అరవింద్ శ్రీనివాస్కు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే జల్లికట్టుకు అనుమతులు ఇచ్చి పెద్ద దుమారానికి తెరలేపింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ థియేటర్ల నిర్ణయంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకోవడానికి వేరే మార్గాలు అమలుచేయాలి కానీ.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టకూడదు అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
Must Read ;- జల్లికట్లు జరుపుకోవచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి..
There are times when 50% is way better than a 100%. This is one of them.
— arvind swami (@thearvindswami) January 4, 2021
ప్రముఖులు సైతం..
సామాన్య ప్రజలే కాదు.. కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ప్రభుత్వ నిర్నయాన్ని తప్పుబడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినీ నటుడు అరవింద్ స్వామి థియేటర్లలో 50 శాతం జనాభానే అనుమతించాలని తనదైన రీతిలో ట్వీట్ చేశారు. ‘కొన్ని సందర్భాల్లో 100 శాతం కంటే 50 శాతం మంచిది.. అది ఈ సందర్భానికి వర్తిస్తుంది.’ అంటూ చేసిన ట్వీట్ని ప్రస్తుతం నెటిజన్లు డాక్టర్ అరవింద్ ట్వీట్తో పాటు వైరల్ చేస్తున్నారు.
వెనక్కుతీసుకోండి
తమిళనాడు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తప్పుపట్టింది. 100 శాతం జనాభాను అనుమతించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించుకుని సూచించింది. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని, కొత్త రకం కరోనా దేశంలో విస్తరిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఎట్టి పరిస్థితులలో ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
Also Read ;- కరోనా కాలంలో డరోనా వ్యాపారం చేసిన ఓటీటీలు











