ప్రజాకవి ఏపూరి సోమన్న ఈరోజు షర్మిల పార్టీలో చేరనున్నారు. ఈరోజు సాయంత్రంలోపు షర్మిల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న షర్మిల హైదరాబాద్కు చేరుకోగానే ఏపూరి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్లగొండ నేతలతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే ఏపూరి బాటలో మరికొంతమంది నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు షర్మిల పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ప్రజా గొంతుక
టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ఏపూరి సోమన్న ముందుంటారు. తన ఆటపాటలతో హోరెత్తించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. గద్దర్ తర్వాత, ఆస్థాయి పేరు తెచ్చుకున్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని భావించిన ఆయన కాంగ్రెస్లో చేరి, పార్టీకి సేవలందించారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సోమన్నకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయిన ఏపూరి షర్మిల పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- షర్మిల పార్టీ యాక్షన్.. డైరెక్షన్ పీకేదెనా..?











