సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు వి.దొరస్వామి రాజు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకు వచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, కీరవాణి ఫిలింఛాంబర్ కు వచ్చి దొరస్వామిరాజు మృతదేహాం వద్ద నివాళులు అర్పించారు.
నిర్మాత సి. అశ్వనీదత్, రాశి మూవీస్ నరసింహారావు, ఎం.ఎల్. కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. తరువాత 11 గంటలకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి.
Must Read ;- అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం